06-08-2025 12:42:22 AM
సదాశివపేట, ఆగష్టు 5 : సదాశివపేట పట్టణానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సదాశివపేట పట్టణానికి, మండలానికి చెందిన రూ.8,78000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మాజీ కౌన్సిలర్లు కలీం పటేల్ మొబిన్ మోహియోద్దీన్ పిచరాగడి శివకుమార్,ఖాజా, మైనారిటీ కమిల్ ఆన్సర్, బరడి శివ, నాగుల విజయ్, మండల పార్టీ అధ్యక్షులు మరియు రత్నాకర్ రెడ్డి, మాధవరెడ్డి, కరుణాకర్ రెడ్డి , ఆత్మకూర్ సత్యనారాయణ యాదవ్ , సుదీర్ రెడ్డి,లక్ష్మారెడ్డి, నరేష్ గౌడ్, యాదగౌడ్, యాదన్న , సలావుద్దీన్, లబ్ధిదారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.