17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

14-04-2026 01:30 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌తో పాటు సారంగాపూర్ మండల కేంద్రంలోని  మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాల్ కి  రూ. 2400/- ఉందని,  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను అమ్మకానికి వేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని అన్ని విధాల ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఒక వైపు చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, ఈ ప్రభుత్వం  రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట నాణ్యతను పక్కనపెట్టి అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల  బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.