29 July, 2026 | 9:54 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

14-04-2026 01:30 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌తో పాటు సారంగాపూర్ మండల కేంద్రంలోని  మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాల్ కి  రూ. 2400/- ఉందని,  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను అమ్మకానికి వేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని అన్ని విధాల ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఒక వైపు చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, ఈ ప్రభుత్వం  రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట నాణ్యతను పక్కనపెట్టి అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల  బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.