08-12-2025 02:42:31 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ కేంద్రంలోని దస్నాపూర్ లో సంత్ శిరోమణి శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజ్ 401వ జయంతి వేడుకల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతాజీ జగన్నాడే మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, అఖిల గాండ్ల తేలి సంఘం జిల్లా అధ్యక్షుడు హివ్రే సందీప్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెంగ్రే ఆకాష్, కోశాధికారి మెంగ్రే సంతోష్, మండల అధ్యక్షుడు బిజ్జు, వివిధ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.