రాజంపేటలో ఓటు వేసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి
17-12-2025 09:23 AM
కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సర్పంచ్ తుది దశ ఎన్నికలలో భాగంగా బుధవారం రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామాలను అభివృద్ధి చేసే వారికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఎమ్మెల్యే భర్త కోవా సోనేరావు, కుమారుడు సాయినాథ్, కుమార్తె మాన్విత బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి బుర్సా పోచయ్య, తదితరులున్నారు.






