25-06-2025 06:54:47 PM
నిరుపేద కుటుంబానికి జైపాల్ రెడ్డి అండ..
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనకలగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద తాపీ మేస్త్రీ సగర ఉప్పర కులస్తుడు కురిమిండ్ల నారాయణ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఈ విషయం తెలుసుకున్న జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి(Jayanna Foundation Chairman Jaipal Reddy) తక్షణమే స్పందించారు. మానవతా దృక్పథంతో నారాయణ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్న జైపాల్ రెడ్డి, వారికి బుధవారం 50 కిలోల బియ్యంతో పాటు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు కొల్లూరి బుచ్చయ్య, కానిగంటి శ్రీనివాస్, కురుమిళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు. జయన్న ఫౌండేషన్ అందించిన ఈ సహాయం పట్ల గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.