14-01-2026 01:03:29 AM
నిర్మల్, జనవరి 13 (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగాపూర్, సొన్, మామడ, లక్ష్మణచందా, దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 103 మంది లబ్ధిదారులకు రూ.32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.