17-06-2025 12:00:00 AM
మేడ్చల్, జూన్ 16(విజయ క్రాంతి): ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సోమవారం విచారణకు హాజరయ్యే ముందు తెలంగా ణ భవన్ లో తన అనుచరులతో కలిసి మద్దతు తెలిపారు.
ఎమ్మెల్యే వెంట ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, మేకల సునీత రాము యాదవ్, ఏకే మురుగేష్, అనిల్ కిషోర్ గౌడ్, జీకే హనుమంతరావు,
చిన్న యాదవ్, శ్రీనివాస్ గౌడ్, భాగ్యనందు, సత్యనారాయణ, ఉపేందర్, లడ్డు నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాసులు, చరణ్ గిరి, సురేష్, హేమంత్ పటేల్, ప్రశాంత్ రెడ్డి, నర్సింగ్ రావు, అరుణ్ రావు, సుమన్ గౌడ్, సాయి గౌడ్, పవన్ తదితరులుఉన్నారు.