17-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 16(విజయక్రాంతి): టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో 49ను రద్దు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. జీవో నెంబ ర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అధ్యక్షతన మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్తో కలిసి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కు వినతిపత్రం అందజేసి, కలెక్టరేట్ ఎదుట జీవో 49 కాపీలు దగ్థం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలను టైగర్ కన్జర్వేషన్ పరిధిలో తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇప్పటికే అభివృద్ధిలో రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న జిల్లాలో ప్రస్తుతం తీసుకువచ్చిన జీవో మరింత అడ్డంకిగా మారుతుందన్నారు.
ప్రస్తుత జీవో ఆదివాసీ ల అస్తిత్వం దెబ్బతీసే విధంగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో జీవో తీసుకురావడం జిల్లా ప్రజలకు నష్టమేనని అన్నా రు. స్థానికంగా ప్రజలను సంప్రదించకుండా ప్రజాప్రతినిధులకు తెలియకుండా జీవో తేవడం ఏంటని ప్రశ్నించారు. ఈ జీవో రైతులకు, గిరిజనులకు, గిరిజనేతరులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.
ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా గిరిజన మహిళ ఉండడంతో ఇటువంటి సమస్యలు పరిష్కా రం అయ్యే అవకాశం ఉండేదని ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి కృష్ణారావుతోపాటు, ఉమ్మడి జిల్లా నుండి నూ తనంగా మంత్రిగా ఎంపికైన వివేక్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల న్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ నాయకులను నిలదీసి ప్రశ్నించాలన్నారు.
ఇప్పటికే అటవీ అధికారులు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని, ఈ జీవోతో ఆ అడ్డగింతలు మరింత పెరగనున్నట్లు వివరించారు. జీవో రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి నాయ కు లు ప్రహ్లాద్, చర్ల మురళీధర్, గొల్ల, వెంకన్న, ప్రసాద్ గౌడ్, రవి, జయరాజ్ పాల్గొన్నారు.