16-06-2025 11:42:32 PM
ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) సరూర్నగర్ మండలం మనసురాబాద్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ నాయకులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ముందుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బీజేవైఎం నాయకుడు సోమనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ మన్సూరాబాద్డివిజన్ప్రెసిడెంట్మునగాల హరీష్ రెడ్డి , బీజేవైఎం నాయకులు అమరేష్ , సాయిరాం గౌడ్, పారంద సాయి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.