07-06-2025 04:32:16 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గం మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్, సెంటు పాయిస్ స్కూల్ సమీపంలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) శనివారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ 30.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కాలనీవాసులు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు మంజూరు చేయించాలని, అల్వాల్ హిల్స్ రోడ్ 15 నుంచి దేవాలయం వరకు తాగునీరు పైపులైన్ వేయించాలని ఎమ్మెల్యేను కోరారు.
దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు భూపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, నర్సింగరావు, శ్రీనివాస్, రమేష్, కిరణ్ కుమార్, వెంకన్న, భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి, ప్రదీప్ రెడ్డి, రమేష్ కుమార్, కిషన్, దేవేందర్ రావు, బి ఆర్ ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, సురేందర్ రెడ్డి, పవన్, ప్రశాంత్ రెడ్డి, శరణగిరి తదితరులు పాల్గొన్నారు.