calender_icon.png 7 June, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్

07-06-2025 04:29:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion)కు కాంగ్రెస్ అధిష్ఠానం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మంత్రివర్గంలో ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉందని, కేబినెట్ విస్తరణ(Cabinet Expansion)పై తుదిదశలో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణాలపై నేతలతో  సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంతనాలు జరుపుతున్నారు. పార్టీ ఇన్ ఛార్జీతో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు.

ఈ మేరకు ప్రస్తుతం కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో నాలుగు  స్థానాలను భర్తీ చేసేందుకు చర్యలు జరిగుతున్నాయి. ఎస్సీ, బీసీ ఓసీలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఓసీ నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీ నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ లకు మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Telangana Assembly Speaker)గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

ఈ మంత్రి పదవుల రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం.