23-07-2025 12:00:00 AM
చొప్పదండి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
చొప్పదండి, జూలై 22 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా చొప్పదండి నియోజకవర్గం లోని పెండింగ్ లో ఉ న్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను గు రించి ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే సత్యం చర్చించారు.
ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. చొప్పదండి నియో జకవర్గం వరప్రదాయనిగా ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గం లోని పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సైతం నిధులు కేటాయించి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే సత్యం తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించడానికి అనుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలుతెలిపారు.