calender_icon.png 24 June, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవీకే ఫ్యామిలీ హోటల్ & రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

23-06-2025 08:32:26 PM

కోదాడ: యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోనీ హుజూర్ నగర్ రోడ్డులోని పాత సాయిబిందు రెస్టారెంట్ బిల్డింగ్ లో నిర్వహకులు నడిగూడెం మాజీ ఎంపీపీ కాసాని విమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ యజమానులు నాణ్యమైన ఆహార పదార్థాలు, సేవలు అందజేసి పేరు గడించాలన్నారు. ఎర్నేని బాబు,  చందర్రావు, ముత్తావరపు పాండురంగారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, దేవ బత్తిని రమేష్, గడ్డం మల్లేష్ యాదవ్, బూతుకూరి వెంకటరెడ్డి, పాల్గొన్నారు.