20 March, 2026 | 8:06 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మృతుల కుటుంబాల పరమార్శించిన ఎమ్మెల్యే సామేలు

18-01-2026 11:01 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): విధుల నిర్వహణలో భాగంగా నల్గొండ నుండి తుంగతుర్తి మండలానికి విచ్చేయుచున్న ప్రధానోపాధ్యాయు రాలు గీతారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల ఎస్ఓ కల్పన జాజిరెడ్డిగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఉపాధ్యాయురాలు మృతి చెందారు. దీనితో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదివారం ఉదయం నల్గొండలో వారి కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధనా అందిస్తున్న ఇరువురు ఉపాధ్యాయురాలు ఒకే సంఘటన లో మృతి చెందిన బాధాకర విషయం అని, గాయాలకు గురైన తుంగతుర్తి హెడ్మాస్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారం హెడ్మాస్టర్ సుధారాణిలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. జరిగిన సంఘటనపై పోలీసు అధికారులు విచారణ జరిపించాలని అన్నారు.