calender_icon.png 26 June, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యావర్ రోడ్ విస్తరణకు కృషి ఎమ్మెల్యే సంజయ్ కుమార్

26-06-2025 12:49:05 AM

జగిత్యాల అర్బన్, జూన్ 25 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ విస్తరణకు కట్టుబడి ఉన్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 20వార్డులో రు. 15 లక్షలతో సిసి రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.

యావర్ రోడ్డు 100 మీటర్లు వెడల్పుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గొల్లపల్లి రోడ్డు వెడల్పు చేసుకున్నామన్నారు.పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయటం జరుగుతుందన్నారు.జగిత్యాల పట్టణ అభివృద్ధి లో అందరూ ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని, పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. పక్కా ప్రణాళికతో భవిష్యత్ అవసరాలను ఆలోచన చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

యావర్ రోడ్డు వెడల్పు కోసం కట్టుబడి ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారన్నారు.పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత పాటించాలని ఈ విషయంలో అధికారులు బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు.

యావర్ రోడ్డు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ అనుమల్ల కృష్ణహరి, అడువాల లక్ష్మణ్, బాలే శంకర్, చెట్పల్లి సుధాకర్, క్యాదాసు నాగయ్య, మహేందర్, ఏఈ అనిల్, గిరి, శరత్, ప్రభాత్, రాజ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.