2 September, 2026 | 9:16 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

118 జీవోపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..

18-03-2025 | 11:15pm

ఎల్బీనగర్: అసెంబ్లీ సమావేశాల్లో 118 జీవోపై స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 44 కాలనీల్లో పేద, మధ్య తరగతి వారు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇండ్లు కట్టుకుని నివాసముంటున్నారని తెలిపారు. వారికి 2007 నుంచి ఇండ్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, వారి ఇబ్బందులు గ్రహించి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో విడుదల చేసినట్లు చెప్పారు. 118 జీవోతో 75 శాతం వరకు కాలనీవాసులు లబ్ధి పొందారని, ఇంకా 25 శాతం ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాగా, డిసెంబర్ 2023 నుంచి జీవో అమలును నిలిపివేసినట్లు వివరించారు. జీవో 118ను పునరుద్ధరించాలని, నిషేధిత జాబితా నుంచి 22ఏ ను తొలగించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. దీనికి స్పందించిన రెవెన్యూశాఖ మంత్రి మాట్లాడుతూ... సుధీర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకొని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.