22 April, 2026 | 7:18 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

118 జీవోపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..

18-03-2025 11:15 PM

ఎల్బీనగర్: అసెంబ్లీ సమావేశాల్లో 118 జీవోపై స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 44 కాలనీల్లో పేద, మధ్య తరగతి వారు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇండ్లు కట్టుకుని నివాసముంటున్నారని తెలిపారు. వారికి 2007 నుంచి ఇండ్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, వారి ఇబ్బందులు గ్రహించి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో విడుదల చేసినట్లు చెప్పారు. 118 జీవోతో 75 శాతం వరకు కాలనీవాసులు లబ్ధి పొందారని, ఇంకా 25 శాతం ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాగా, డిసెంబర్ 2023 నుంచి జీవో అమలును నిలిపివేసినట్లు వివరించారు. జీవో 118ను పునరుద్ధరించాలని, నిషేధిత జాబితా నుంచి 22ఏ ను తొలగించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. దీనికి స్పందించిన రెవెన్యూశాఖ మంత్రి మాట్లాడుతూ... సుధీర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకొని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.