29 April, 2026 | 11:27 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఠానునాయక్ స్ఫూర్తితో ఉద్యమించాలి

19-03-2025 12:00 AM

తెలంగాణ గిరిజన సంఘం 

మహాబూబాబాద్ మార్చి 18 :(విజయ క్రాంతి ) మహాబూబాబాబ్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి తండాలో తెలంగాణ గిరిజన సంఘం సమావేశం బానోత్ రాజేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య హరినాయక్ పాల్గొని మాట్లాడుతూ నేటి యువత ఠాను నాయక్ స్ఫూర్తితో ఉద్యమాలలో పాల్గొని గిరిజనుల హక్కుల కోసం,ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టే విధంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం, భూస్వాములు,పెత్తందారుల దౌర్జన్యాలు,ఆగడాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి గడగడ లాడించిన పోరాట యోధుడు ఠాను నాయక్ అని అన్నారు.మార్చి 20న ఠాను నాయక్ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు తండాలలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గుగులోతు శంకర్ నాయక్, ధరావత్ రమేష్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.