2 September, 2026 | 8:33 PM

Breaking News

గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •   ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని డిఎంహెచ్వోకు వినతిపత్రం   •  

ఠానునాయక్ స్ఫూర్తితో ఉద్యమించాలి

19-03-2025 | 12:00am

తెలంగాణ గిరిజన సంఘం 

మహాబూబాబాద్ మార్చి 18 :(విజయ క్రాంతి ) మహాబూబాబాబ్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి తండాలో తెలంగాణ గిరిజన సంఘం సమావేశం బానోత్ రాజేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య హరినాయక్ పాల్గొని మాట్లాడుతూ నేటి యువత ఠాను నాయక్ స్ఫూర్తితో ఉద్యమాలలో పాల్గొని గిరిజనుల హక్కుల కోసం,ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టే విధంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం, భూస్వాములు,పెత్తందారుల దౌర్జన్యాలు,ఆగడాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి గడగడ లాడించిన పోరాట యోధుడు ఠాను నాయక్ అని అన్నారు.మార్చి 20న ఠాను నాయక్ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు తండాలలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గుగులోతు శంకర్ నాయక్, ధరావత్ రమేష్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.