08-12-2025 12:00:00 AM
జుక్కల్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రకండి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రకాష్ పటేల్ గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితుడు ప్రకాష్ పటేల్ ఆకస్మాత్తుగా మరణించడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ప్రకాష్ పటేల్ కు చిన్న పిల్లలు ఉన్నారని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.