14-01-2026 11:17:00 AM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఈ సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి భవిష్యత్తు తరాలు బాగుండాలని సంకల్పంతో ప్రతిక్షణం పాటుపడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నాని, ఎల్లప్పుడు వాస్తవాలను ముందు ఉంచి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రజలు అండగా ఉంటారని ఆశిస్తున్నానని తెలియజేశారు.