calender_icon.png 2 June, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మెరిసే ఉత్పత్తులు చీకటి ఉద్దేశాలు’

31-05-2025 07:16:42 PM

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

మహబూబాబాద్ (విజయక్రాంతి): పొగాకు వినియోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 8 మిలియన్లలో 7 మిలియన్ల మంది మరణిస్తుండగా, సెకండ్ హ్యాండ్ పొగాకు గురికావడం వల్ల 1.2 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయని, జరుగుతున్నాయని, పొగాకు వినియోగాన్ని, వినియోగించే వారికి దూరంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్(District Medical Officer Dr. Ravi Rathod) అన్నారు. ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పొగాకు నివారణ కోసం జిల్లాలో వివిధ అవగాహన కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రణాళిక చేసి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల డాక్టర్లకు సూచించారు.

1. జిల్లాలో సమన్వయ సమావేశాల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం.

2. పోలీసు శాఖతో సమన్వయంతో COTPA, (సిగరెట్ అండ్ అదర్ టోబాకో ప్రాడక్ట్ ఆక్ట్ ) 2003 అమలు కోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టడం , సెక్షన్ 4 (బహిరంగ ప్రదేశాలలో ధూమపాన నిషేధం), సెక్షన్ 6 (విద్యా సంస్థ నుండి 100 గజాలలోపు అమ్మకాలను నిషేధించడం, పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేధం) 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు మరియు చట్టం యొక్క సెక్షన్ 7 (చట్టబద్ధమైన చిత్ర హెచ్చరికలు లేకుండా పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం) చేయడం. 

3. పొగాకు ఉత్పత్తులపై  హెచ్చరికలు పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాల గురించిన అవగాహనను గణనీయంగా పెంచుతాయి. 

4. పొగాకు మహమ్మారిని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, పాలసీ అమలును తెలియజేయడానికి నిఘా చాలా కీలకం. 

5. పొగాకు పైన పన్నులు వేయడం అనేది అభినందనీయమైనదని, అయితే వాటి అమలు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది.  

6. ఆరోగ్య విద్యా కార్యక్రమాలు, ప్రచారాలు, కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా పొగాకు వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను గురించి సమాచారాన్ని ప్రజాలలోకి విరివిగా తీసుకెళ్లవలిసిన ఆవశ్యకత  చాలావుంది అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులను మానివేయాలనుకునే పొగాకు వినియోగదారులకు కౌన్సెలింగ్, హెల్ప్ లైన్‌లు, అవగాహన కార్యక్రమములు నిర్వహించాలని, అవగాహన పెంచడానికి, పొగాకు రహిత జీవనశైలిని ప్రోత్సహించడానికి పాఠశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సంస్థలతో కలిసి పని చేయాలని, పొగాకు రహిత భవిష్యత్తును సృష్టించడంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి, ప్రోగ్రామ్ఆఫీసర్స్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సారంగం, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆరోగ్య విద్య బోధకులు కెవి రాజు, పురుషోత్తం, శారద, ఆశ నోడల్ ఆఫీసర్ సక్కుబాయి, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, డిపిఎం నీలోహన, డిడిఎం సోమిత్, రాజ్ కుమార్, ఎర్లీ కంప్యూటర్ అరుణ్,మనోహర్, టీవీ కోఆర్డినేటర్ నీలిమ శ్వేత, అశోక్, అరుణ్, ప్రశాంత్  సిబ్బంది పాల్గొన్నారు.