డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ
చేవెళ్ల, మార్చి 30 (విజయక్రాంతి): చేవెళ్ళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిందని వారు ప్రకటనలో పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కవిత నిర్వహించగా సమన్వయంతో బి.ఏ. విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ విధానాన్ని ప్రతిబింబించేలా జరిగింది. విద్యార్థులు అధికార పార్టీగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వంటి పార్టీల పాత్రలను పోషిస్తూ ప్రశ్నోత్తరాలు, చర్చలు, వాదనలు వినిపించారు.
సభ నిర్వహణలో విద్యార్థులు చూపిన చాతుర్యం ప్రశంసనీయంగా నిలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభ విధులు, రాజకీయ అవగాహనపై పొందడం వక్తృత్వ నైపుణ్యాలు ఆత్మవిశ్వాసం చేకూరుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సి. కాంచనలత విద్యార్థులను అభినందించారు. ఈ పొగ్రాం సమాజంలో బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ మాక్ అసెంబ్లీ విద్యార్థులకు అనుభవంతోపాటు విద్య ప్రాముఖ్యతను ప్రతిబింబించిందన్నారు.




