12-06-2025 12:23:53 AM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి
పెద్దపల్లి, జూన్11 (విజయ క్రాంతి)జిల్లాలో శిశువులకు పూర్తి స్థాయిలో రోటా సిల్ వ్యాక్సిన్ అం దించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు.బుధవారం పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 2 డోసులు కలిగిన రోటాసిల్ వ్యాక్సిన్ వాయిల్ను ఆమెప్రారంబించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రోటాసిల్ వ్యా క్సిన్ను 6 వారాల వయస్సు గల శిశువుకు ఓ.పి.వి. , పెంటా వాలెంట్ యొక్క మొదటి డోసు తో పాటు ఇవ్వాలన్నారు.
రెండవ డోసు 10 వారాలకు, మూడవ డోసు 14 వారాల వయస్సు గల పిల్లలకు నోటి ద్వారా 2 యం.ఎల్ డోసు ను ఇవ్వాలని, ఈ రోటా సిల్ వ్యాక్సిన్ మూడు డోసులు ఇవ్వాలని, బూస్టర్ డోసు అవసరం లేదన్నారు. రోటా వైరస్ సోకిన యెడల చిన్న పిల్లలలో తీవ్ర నీళ్ళ విరోచనాలతో పాటు జ్వరం, వాంతులు కొన్ని సార్లు కడుపు నొప్పి కూడా ఉంటుందని, ఈ నీళ్ళ వి రోచనాలు అదికంగా కావడం వలన ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం కావచ్చు,
లేదా మరణం సంభవించవచ్చని,కావున ఈ వ్యాధి నిరోథక టీకాను తప్పకుండా పిల్లలకు వేయించాలని, పిల్లలకు ఏదైనా సాధారణ అనారోగ్యం అంటే తేలికపాటి జ్వరం, దగ్గు మొదలైనవి ఉన్ననూ ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చునని, శిశువుకు టీకా వేయించక ముందు వేయించిన తరువాత తల్లి పాలు పట్టవచ్చునని, ఈవ్యాక్సిన్ వినియోగం పైన,ఇ-విన్ పోర్టల్లో నమోదు పైన వైద్య సిబ్బిందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమములో డా. బి. కిరణ్ కుమార్, ప్రో గ్రామ్ అధికారి (సి.హెచ్ అండ్ ఐ), డా. స్వాతి భాను, వైద్యాధికారి, అఖిల, వి.సి.సి.ఎమ్ మరియు వైద్య సిబ్బంది పాల్గోన్నారు.