calender_icon.png 14 June, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ సెంటిమెంట్ కదిలించింది

12-10-2024 01:21:10 AM

గోపిచంద్ హీరోగా రూపొందిన ‘విశ్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. సినిమా మంచి టాక్ వస్తుండటంతో చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

ఈ సందర్భంగా గోపి చంద్ మాట్లాడుతూ.. “మేం నమ్మిన విధంగానే ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం” అని తెలిపారు. కథానాయిక కావ్య థాపర్ మాట్లాడుతూ.. ”నా కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా. సినిమాలోని అమ్మ సెంటిమెంట్ నన్ను కదిలించింది” అని పేర్కొన్నారు.

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. “సినిమాను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతు న్నారు. ప్రేక్షకులు కథ, కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషన్, సెంటిమెంట్‌ని ఎక్కువగా ఆదరించడం ఆశ్చర్యంగా అనిపించింది. రైలులో సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది” అని పేర్కొన్నారు. నిర్మాత వేణు మాట్లాడుతూ.. “సినిమాలో శ్రీను వైట్ల కామెడీ అద్భుతంగా వర్కవుట్ అయిందని చెబుతున్నారు. గోపిచంద్ నటనకు చాలా ప్రశంసలు వస్తున్నాయి” అని తెలిపారు.