16-07-2025 11:57:42 PM
గంగోరి గూడెంలో మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
మునుగోడు,(విజయక్రాంతి): ప్రస్తుతం బంధువుల్లో ఎవరు ఏం అవుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి బిజీ లైఫ్లో కొంతమంది జంతువుల పట్ల సానుభూతి, ప్రేమ చూపిస్తుంటే ఇప్పటికీ మానవత్వం, ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని అనిపిస్తోంది. కనీసం రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడినా, చనిపోయినా మనకెందుకులేనని వెళ్లిపోయే ఈ రోజుల్లో ఓ వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని గంగోరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మృతి చెందిన కోతికి గ్రామ మాజీ సర్పంచ్ పానుగంటి పారిజాత నరసింహ గౌడ్ పెద్దలతో చర్చించి సాంప్రదాయ బద్ధకంగా పూలమాలవేసి గ్రామ వీధుల్లో మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామం పెద్దలు స్థానికులు ఉన్నారు.