15 March, 2026 | 11:12 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

భిక్కనూరు రోడ్డుపై కోతుల హంగామా.. జనం పరుగు!

17-01-2026 07:29 PM

భిక్కనూరు,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సుమారు 200కు పైగా కోతులు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డుపై పరస్పరం దాడులకు దిగడంతో పట్టణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. గాంధీ చౌక్ సమీపంలో ఒక్కసారిగా పెద్దగా అరుపులు వినిపించడంతో ఏమైందో అర్థం కాక స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపటికే కోతుల గుంపులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ రోడ్డంతా ఆక్రమించాయి.

ఈ హంగామాతో వ్యాపారులు షాపుల షట్టర్లు మూసివేసి లోపలికి చేరుకోగా, నీటి కోసం వచ్చిన మహిళలు ఖాళీ బిందెలతోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. కొందరు కోతులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినా అవి మరింత రెచ్చిపోవడంతో ఎవరూ బయటకు రావడానికి సాహసం చేయలేకపోయారు. దాదాపు అరగంట పాటు భయానక పరిస్థితులు నెలకొనగా, అక్కడికి వీధి కుక్కలు చేరడంతో కోతులు చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. ఈ ఘటనతో భిక్కనూరు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.