01-02-2026 03:19:55 AM
బెజ్జంకి, జనవరి 31: కన్నతల్లిని, కుమారుడిని అత్యంత కిరాతకంగా చంపిన వ్యక్తి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని వడ్లూరు శనివారం చోటుచేసుకుంది. వడ్లూరుకు చెందిన జక్కని సత్తయ్య తన తల్లి శారద, కొడుకు సురేష్ను హత్య చేసి అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య జరిగే సమయంలో మృతుడి భార్య ఇంట్లో లేనట్టు సమాచారం. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.