12-06-2025 01:05:54 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, జూన్ 11 (విజయ క్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి జిల్లాలో దోమకొండ ప్రాజెక్ట్ మాచారెడ్డి అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి ఎగ్ బిర్యానీ వండి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కిచెన్ గార్డెనింగ్ లో భాగంగా బీర ,సొర, కాకర వంటి తీగజాతి మొక్కలను జిల్లా కలెక్టర్ నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ సెంటర్లో న్యూట్రి గార్డెన్ కిచెన్ గార్డెన్ల ఏర్పాటు చేసుకోవాలని, పిల్లల పౌష్టికాహారం ఉద్దేశించి పోషణ అభియాన్ లో సరైన డేటా ఇవ్వాలని బాలింతలు, గర్భవతులు పౌష్టికాహారాన్ని విధిగా స్వీకరించాలని దీనికి తగిన ఏర్పాట్లు అంగన్వాడి అధికారులు టీచర్లు సంబంధిత అధికారులు తమ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలని ఇందుకుగాను సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ స్కూల్ పిల్లలు 100% అటెండ్ అయ్యేలాచుడాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లలతొ ఏబీసీడీ చెప్పించారు. అనంతరం అంగన్వాడి పిల్లలతో సెల్ఫి విత్ అంగన్వాడీ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీడీవో, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండల కేంద్రంలో..
బాన్సువాడ జూన్ 11 (విజయ క్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘అమ్మ మాట - అంగన్వాడీ బాట‘ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథి సీడీపీవో సౌభాగ్య, సూపర్వైజర్ సుమలత మాట్లాడుతూ.
ఈనెల 17 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సెల్ఫీ కార్నర్, పిల్లలు, తల్లులతో ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎగ్ బిర్యానీని అంగన్వాడీల్లో ప్రారంభించడం సంతోషమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, పంచాయతీ సెక్రటరీ గంగారాం, తదితరులు పాల్గొన్నారు.