calender_icon.png 17 June, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ దొంగల అరెస్టు

12-06-2025 01:07:29 AM

నిజామాబాద్ జూన్ 11:(విజయ క్రాంతి) దొంగతనాలకు అలవాటు పడి దోచుకోబడిన సత్తు అమ్ముకొని జరసాలు చేస్తున్న నేరస్తులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన సర్వాయి మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతూ న్నా ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకటరెడ్డి తెలిపారు.

నిజామాబాద్ ఏసీబీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పిట్ల మొగులయ్య ఈ ఏడాది మే 5న నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్కింగ్ ఏరియాలో తన బైక్ను పార్కు చేశారు.  అని ముగించుకొని వచ్చేసరికి తన బైకు లేకపోవడంతో బైక్ దొంగతనానికి గురైందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న ఒకటొకట పోలీసులు ఎస్ హెచ్ ఓ రాకపోతే ఆధ్వర్యంలో బోధన్ రోడ్ లో వాహనాలు తనిఖీలు నిర్వహించారు ఇద్దరి యువకులు బైక్ పై వెళుతుండగా పోలీసులు ఆపి పత్రాలు చూపించాలని కోరగా వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తీసుకున్న వ్యక్తులను విచారించగా బోధన్ పట్టణంలోని ఆజాం గంజ్ కు చెందిన మలోతు రమేష్ అలియాస్ తులసీరామ్ తో పాటు బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కటం రవి అలియాస్ సద్దాం గా గుర్తించారు.  బాసర నుంచి ఒకటి తిరుమనపల్లిలో ఒకటి నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి ఒకటి వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఒకటి నగరంలోని గ్లామర్ హోటల్ నుంచి ఒకటి వీక్లీ మార్కెట్ నుంచి ఒకటి మొత్తం ఆరు బైకులు దొంగలు ఇచ్చారని పోలీసులు విచారణలో తేలింది వారి వద్ద నుండి ఆరు బైక్లను స్వాధీనం చేసుకొన్నా ట్లు ఏసీబీ రాజా వెంకటరెడ్డి తెలిపారు.

గతంలో మాలోపు రమేష్ ఒక బైకును దొంగతనం చేయగా కటకం రవి బోధన్ నిజాంబాద్ ఏరియాలో రెండు బైకులు చోరీ చేయగా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారని. ఇటీవల విడుదలైన వీరు తమ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు పై ఇద్దరిపై ఆర్గనైసేడ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు ఆయన తెలిపారు.  ఈ విలేకరుల సమావేశంలో సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి కేసు దర్యాప్తులో పాల్గొన్న కానిస్టేబులు హాజరయ్యారు.