4 May, 2026 | 4:07 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

రోడ్డు వేశారు.. మట్టి మరిచారు..

07-01-2026 12:40 AM

బూర్గంపాడు, జనవరి6,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలోని మసీదు రోడ్డు సీసీ రోడ్డు వేసి నెలలు గడుస్తున్నాయి. కానీ ఆ రోడ్డుకు ఇరువై పులా మట్టిని వేయడం మరిచి పోయారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే వెళ్లడానికి దారిలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మసీదు రోడ్డు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెళ్తున్న ఓ కారు, స్కూల్ పిల్లల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయాయి.

సిసి రోడ్డు అంచుకు వెళ్లిన క్రమంలో, రోడ్డు పక్కన ఉండాల్సిన మట్టి నింపకపోవడంతో కారు,స్కూల్ బస్సు కిందకి జారిపోయి ప్రమాదానికి గురయ్యాయి. అదృష్టవశాత్తు బస్సులోని పిల్లలకు,ఆ సమయంలో అక్కడ  ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డు వేసి రెండు నెలలు పైగా అవుతున్నా, మట్టిని వేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయించాలని వాహనదారులు,గ్రామస్థులు కోరుతున్నారు.