4 May, 2026 | 2:47 PM

Breaking News

మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •   జిల్లాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు   •  

ఇండ్లు కూల్చివేతపై బాధితుల ఆందోళన

07-01-2026 12:41 AM

మంథని జనవరి 6(విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారం పేట గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రామగుండం ఓసిపి-2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇందు కూర్చి వేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడే ఉండి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తూ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించే లేదని వారు ఆందోళన చేశారు. వీరి ఆందోళన కారణంగా మంథని పెద్దపెల్లి రహదారిపై భారీగా వాహనాలతో స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరిఖని 1-టౌన్, 2-టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్ రావు, ఎస్త్స్రలు శ్రీనివాస్, దివ్య తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చేర్చించారు.

అయినప్పటికీ బాధితులు తమ ఆందోళన విరమించకపోవడంతో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో చర్చలు జరిపి బాధితులను శాంతింప చేశారు. తమ సమస్యలను ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు పాల్పడడం సమంజసం కాదని కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు.