calender_icon.png 17 June, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ ఈటల పర్యటన

17-06-2025 12:00:00 AM

మేడ్చల్ అర్బన్, జూన్ 16:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ గ్రామాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రా జేందర్ సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా సైదోని గడ్డ తండాలోని అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైదాని గడ్డ తండాలో ని సమస్యలను భారత టెలి కమ్యూనికేషన్ హైదరాబాద్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు ఎంపీ ఈటెల రాజేందర్ కు వివరించారు.

గ్రామంలో మురికి నీరు, గ్రామంలోని రోడ్లపై వీధి ద్వీపాల కొరత ఇతర సమస్యల పరిష్కారానికి ఈటెల రాజేందర్ కృషి చేయాలని సైదోని గడ్డ తండా గ్రామస్తులు కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

శ్రీరంగవరం గ్రామంలో రామాలయం పనులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నందా రెడ్డి, మాజీ సర్పంచ్ పోచయ్య ముదిరాజ్, ఎల్లంపేట మాజీ సర్పంచ్ జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.