16-06-2025 11:40:28 PM
సిపిఎం, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన..
ఇబ్రహీంపట్నం: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రుమ్ ఇండ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని సిపిఎం(CPM), బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేట్ వద్ద, గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం వహిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇండ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా, ఇంకా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటహించకపోతే తొందరలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సిపిఎం, బిఆర్ఎస్ పార్టీల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, బిఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.