17-06-2025 12:00:00 AM
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆగ్రహం
ఆదిలాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) : అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసేలా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయ డం సిగ్గుచేటని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు.
గత పదేళ్లు పాలించిన బీఆర్ ఎస్ ఏం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శులు గుప్పిస్తోందని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్లు అప్పు మిగిల్చడం తప్ప అభివృద్ధి లేదన్నారు.
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణంతో పాటు మహిళలకు ఉచిత బస్సు, రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు కేంద్రం గ్యాస్ ధరలను పెంచి పేదవాళ్లను మోసం చేస్తే తమ ప్రభుత్వం రూ.౫౦౦లకే గ్యాస్ సిలెండర్ను ఇస్తుందని, రూ.21వేల కోట్ల రుణ మాఫీ చేసినా విమర్శలు మాత్రం చేస్తున్నారన్నారు.త్వరలోనే జొన్నకొనుగోళ్లకు సం బంధించి నిధులు విడుదల కానున్నాయన్నారు.
ఈ మీడియా సమావేశంలో కాం గ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, మైనారిటీ నాయకులు ఎం.ఏ షకీల్, శంకరయ్య, దాసరి ఆశన్న, దొగ్గలి రాజేశ్వర్,యాల్ల పోతా రెడ్డి, ఎల్మ రామ్ రెడ్డి,సంతోష్, ఎల్చల్వార్ సురేందర్, అంజద్ ఖాన్, అశోక్,భూమన్న, దిలీప్, సిరాజ్, మోహిన్,ఇర్ఫాన్, కాంబ్లే విట్టల్,నలిమెల పోతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.