26-07-2025 08:13:10 PM
కొండాపూర్: కొండాపూర్ మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో శనివారం హరితహారం నర్సరీని సందర్శించి కమ్యూనిటీ స్థలంలో పెట్టిన మొక్కలను చూసి ఎంపీడీవో సత్తయ్య(MPDO Sathaiah) మరికొన్ని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని అన్నారు. ఈత మొక్కలు అద్భుతంగా పెంచినందుకు పంచాయతీ కార్యదర్శికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో వీరప్ప, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కూలీలు ఉన్నారు.