15 April, 2026 | 1:38 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

అనారోగ్యంతో ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ మృతి

28-02-2026 09:34 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి శనివారం మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురంకు చెందిన శ్రీధర ఉమారాణి  గతంలో మంగపేట మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఉమారాణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం కమలాపురంలో మృతి చెందారు. ఉమారాణి మృత దేహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, వాజేడు మండల పంచాయతీ అధికారి బి.శ్రీకాంత్ నాయుడు సందర్శించి పార్థివదేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వపరంగా అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా ముప్పై వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.