అనారోగ్యంతో ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ మృతి
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి శనివారం మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురంకు చెందిన శ్రీధర ఉమారాణి గతంలో మంగపేట మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.
ఉమారాణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం కమలాపురంలో మృతి చెందారు. ఉమారాణి మృత దేహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, వాజేడు మండల పంచాయతీ అధికారి బి.శ్రీకాంత్ నాయుడు సందర్శించి పార్థివదేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వపరంగా అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా ముప్పై వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.




