calender_icon.png 30 May, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీపీ ఏపీఎంను నియమించాలి..

29-05-2025 11:07:19 PM

కొండపాక: కుకునూరు పల్లి మండలం ఏర్పడి నెలలు గడుస్తున్న ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఎస్ఈఆర్పి, ఐకెపి, ఆఫీసు ఏర్పాటు చేసి, ఎంపీ ఓ, ఏపిఎం లను నియమించాలని కుకునూరు పల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి(Mandal BJP President Anumula Sampath Reddy) సిద్దిపేట జిల్లా డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డి ఆర్ డి ఓ లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అనుముల సంపత్ రెడ్డి మాట్లాడుతూ... కుకునూరుపల్లి మండలం ఏర్పడి నెలలు గడుస్తున్న, కుకునూరు పల్లి మండల కేంద్రంగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఎస్ ఈ ఆర్ పి, ఐకెపి, ఆఫీస్ ఏర్పాటు చేస్తూ ఏపీవో, ఏపీఎం లను నియమించి కుకునూరుపల్లి మండల కేంద్రంగా పాలన జరిపించాలని అన్నారు.

కుకునూరు పల్లి మండలంలోని గ్రామాలు కొండపాక, జగదేవ్ పూర్, వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉన్నదని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా పాలన జరిపించాలని అనుముల సంపత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కుకునూరుపల్లి మండల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.