calender_icon.png 12 November, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్టర్ ఎక్స్ చిత్రీకరణ పూర్తి

01-07-2024 12:05:00 AM

తమిళ కథానాయకులు ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ ఎక్స్‌”. సీనియర్ నటుడు శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా చిత్రీకరణ పూర్తయింది. చివరి రోజుని సెలబ్రేట్ చేసుకున్న చిత్ర బృందం ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్న యాక్షన్ సన్నివేశాల్ని  స్టంట్ సిల్వా నేతృత్వంలో భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం: ధిబు నినాన్ థామస్, ఛాయాగ్రాహణం: తన్వీర్ మీర్.