12-02-2026 12:00:00 AM
మంథనిలో ఎన్నికలు పర్యవేక్షించిన n మంత్రి శ్రీధర్ బాబు
మంథని మున్సిపాలిటీ లో 76.76 శాతం ఓట్లు పోలింగ్
మంథని,ఫిబ్రవరి 11(విజయ క్రాంతి)పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ బుధవారం జరిగిన ఎన్నికల్లో 76.76 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుషుల ఓట్లు 5393 ఓట్లు పోలుకాగా మహిళలు 5663 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 14.4 02 ఓట్లు ఉండగా మొత్తం 11056 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు, 76.76 శాతం ఓట్లు పోలైనట్టు మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు.
ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా గంట వరకు మందకోడిగా సాగింది. 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటర్లు అధిక సంఖ్యలో రావడంతో కొన్ని పోలింగ్ బూతుల్లో ఓటర్లు బార్లు తీరారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడం విశేషం. విజయం పై రాజకీయ పార్టీల్లో ఎవరికివారు ధీమాగా ఉన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం నిర్వహించాయి. 13 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి వచ్చే ఓట్ల ప్రభావం కొన్ని వార్డులో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతోపాటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు లు మంతింలోనే మకాం వేసి ఎన్నికల ను ఇప్పటిక ప్పుడు పరివేక్షించారు. కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను అప్రమతం చేసి ఓటింగ్ సరలని పెంచే విధంగా వ్యూహం రచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.