12-02-2026 12:00:00 AM
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతానికి పైగా స్థానాలలో గెలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మా ట్లాడుతూ తెలంగాణలో ఆశ్చర్యకరంగా బీజే పీ, బిఆర్ఎస్ ఒకటిగా కలిసి ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంగా చేశాయన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోలింగ్ బూత్ లోకి వెళ్లి భయబ్రాంతులకు గురి చేశారని, ప్రభుత్వాన్ని బద నాం చేసే కుట్ర చేశారన్నారు. 10 సంవత్సరాలుగా ము న్సిపాలిటీ లకు ఏమి చేయలేక నిధులు ఇవ్వలేక ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూసిందన్నారు.