30-12-2025 02:06:15 AM
నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బైంసా మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి వారి సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవా రం సిఐటియు మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలో వేతనాలు పెంచిన బైంసా మున్సిపల్ లో వేతనాలు పెంచడం లేదని వేదానాల కోసం ఆం దోళన నిర్వహిస్తే పనిలో నుంచి తీసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జెసికి అం దజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ మున్సిపల్ కార్మికులు ఆరిఫ్ బాయి వినోద్ సుశీల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.