17 April, 2026 | 2:07 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

తుది శ్వాస దాకా అచ్చంపేట అభివృద్ధే నాలక్ష్యం

29-04-2025 12:00 AM

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 

అచ్చంపేట ఏప్రిల్ 28: తాను తుది శ్వాస విడిచే దాకా అచ్చంపేట అభివృద్ధి ప్రధాన లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తన సతీమణి అనురాధ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం కోలుకొని మొదటిసారి అచ్చంపేట నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

మొదటగా మైసిగండి, రంగాపూర్ లోని షావలిన్ దర్గా, ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తన మీద ఉన్న అభిమానంతో భారీ మెజార్టీతో గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎస్‌ఎల్బిసి టర్నల్ వద్ద 12 రోజులపాటు పనిచేయడం ద్వారా కొంతమేర తన ఆరోగ్య పరిస్థితి పట్ల అనుమానం వేసి పరీక్షలు జరిపించుకోవడం జరిగిందన్నారు.

గుండెలో రెండు బ్లాకులకు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందన్నారు. నల్లమల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ సహాయ సహకారాలు మరువలేనివన్నారు. ప్రజా దీవెనలే తనను బతికించాయన్నారు.