28-06-2025 12:10:08 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్లో సికింద్రాబాద్ సర్కిల్కు అసిస్టెంట్ సిటీ ప్లానర్గా బాధ్యతలు స్వీకరించిన పావని, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాల యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, ఏసీపీ పావనికి శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు, ఇతర కీలక కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని సూచించారు.