31-07-2025 12:30:14 AM
ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అంది స్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోం ది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్. తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానా యకుడు, డివైన్ స్టార్ రిషబ్శెట్టితో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ నిర్మాత నాగవంశీ బుధవారం అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ‘కాంతార 2’ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్ష న్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. ప్రతిభావంతుడైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.36గా ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయిసౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.