మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
29-11-2024 01:39 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి) : మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని మంత్రి కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.






