18 March, 2026 | 2:26 AM

గుజరాత్‌కు నందాదేవి

18-03-2026 12:56 AM

46వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో వచ్చిన నౌక

గాంధీనగర్, మార్చి 1౭: భారతదేశపు రెండవ ఎల్‌పీజీ రవాణా నౌక ‘నందా దేవి’ గుజరాత్ ఓడరేవుకు చేరుకుంది. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో ‘నందా దేవి’ అనే మరో ట్యాంకర్ హోర్ముజ్ జలసంధి మీదుగా గుజరాత్‌కు సురక్షితంగా చేరుకుంది. ఖతార్ నుంచి బయలుదేరి హోర్ముజ్ గుండా ప్రయాణించిన ‘నందా దేవి’ అనే ఎల్పీజీ ట్యాంకర్, సుమారు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తూ గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో ఉన్న వడినార్ పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పోర్టులో అన్‌లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

సోమవారం ముంద్రా పోర్టుకు చేరుకున్న మరో ఎల్‌ఫీజీ ట్యాంకర్ తర్వాత ఇది వచ్చింది. ఈ రెండు సరుకుల రాకతో జాతీయ గ్యాస్ నిల్వలు గణనీయంగా బలపడతాయి. ప్రస్తుతం గ్యాస్ సరఫరా గొలుసులో ఎలాంటి కొరత లేదని అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు.దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ మంగళవారం వడినార్‌లో ఒక భారీ నౌక నుంచి నౌకకు ఎల్‌పీజీ బదిలీ కార్యకలాపం ప్రారంభమైనట్లు ప్రకటించారు.

46,500 టన్నుల ఎల్‌పీజీతో ‘నందా దేవి’ మాతృ నౌక చేరుకుందని, దీనిని ఎన్నూర్, హల్దియాకు చేరవేయడం కోసం చిన్న నౌకలకు బదిలీ చేయనున్నారని సింగ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంఘర్షణల మధ్య హోర్ముజ్ జలసంధిని దాటి వచ్చిన భారతదేశపు రెండవ ఎల్‌పీజీ క్యారియర్ ‘నందా దేవి’, 46,500 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో గేపోర్టుకు సురక్షితంగా చేరుకుందని ఒక అధికారి తెలిపారు.‘శివాలిక్’ అనే తొలి నౌక సోమవారం   గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది.