10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దళిత బాంధవుడు నంది ఎల్లయ్య

08-08-2024 03:26 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): స్వర్గీయ నంది ఎల్లయ్య దళిత బాంధవుడు అని, మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన నేత అని ఆయన సోదరుడి కుమారుడు నంది శ్రీహరి అన్నారు. ఎల్లయ్య ఐదు సార్లు సిద్దిపేట, ఒకసారి నాగర్‌కర్నూల్ ఎంపీ గా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. ఎల్లయ్య రాజకీయ వార సత్వాన్ని తాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా, నంది శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం, 2024లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిసి 2025లో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. వారు, సీఎం రేవంత్‌రెడ్డి తన అభ్యర్థిత్వంపై సానుకూలంగా స్పందించినట్లు శ్రీహరి తెలిపారు.