26-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 25(విజయక్రాంతి):దేశం లో ప్రధాని నరేంద్ర మోదీ పాలన వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తుందని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు.
దేశంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ప్రకటించిన ఎమర్జెన్సీ పాలనకు వల్ల ఎందరో అమా యకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మోదీ 11 ఏళ్ల పాలన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంగ ప్ప జిల్లా నాయకులు భూమయ్య రావుల రామనాథ్ అంజుకుమార్రెడ్డి పాల్గొన్నారు.