calender_icon.png 15 June, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

13-06-2025 12:43:39 AM

గద్వాల, జూన్ 12 ( విజయక్రాంతి ) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అ దాలత్ను గద్వాల జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత అన్నారు.

శుక్రవారం తన ఛాంబర్ లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికా ర సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జా తీయ లోక్ అదాలత్ పై విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యా యం పొందవచ్చనని ఈ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించబడతాయన్నా రు.

ఈ నెల 14న, గద్వాల్ లోని న్యాయస్థాన ప్రాంగణంలో లోక్‌అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ పద్దతిలో క్రిమినల్ కేసులు, అన్నిరకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలం తా తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకొని శాంతియుతంగా, సంతోషంగా జీవించాలని ఆమె కోరారు.