27 April, 2026 | 12:19 PM

నాటుసారా, బెల్లం, పటిక పట్టివేత

09-12-2024 07:43 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టెయిన్ పరిధిలోని ఇల్లందు మండలం, ముకందాపురం గ్రామంలో మాసబత్తిని వెంకటరమణ అనే వ్యక్తి  ఇంట్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నాటుసారాయి తయారికి ఉపయోగించే బెల్లం వంద కిలోలు, పటిక ఐదు కిలోలు, నాటు సారాయి ఐదు లీటర్ల ఒక క్యాను లభించిందని తెలిపారు. వాటిని స్వాధీన పరుచుకొని, నాటునాంరాయి అమ్మటం, రవాణా చేయటం చట్టరిత్యా నేరమని తెలిపి, సదరు వ్యక్తిపై కేసు నమెందు చేసి, అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడులలో పాల్గొన్న ఎస్సై ఎల్.అచ్చారావు, సిబ్బంది రవిబాబు, యాకూబ్ పాషా, బాబా, మల్లికార్జున, నరసింహచారి, తుల్సియా, నర్శిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.