09-02-2026 01:16:12 AM
బీఆర్ఎస్ వైపే ఎర్రవల్లి, సింగారం మొగ్గు
గజ్వేల్, ఫిబ్రవరి 8: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులోని సింగారం, ఎర్రవల్లి గ్రామస్థులంతా బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్సి సంతోష్ వైపే మొగ్గు చూపుతున్నారు. గ్రామంలో ఇంటింటా బిఆర్ఎస్ ప్ర చారంలో కౌన్సిలర్ అభ్యర్థి సంతోష్ను ఆడపడుచులంతా దీవిస్తున్నారు. స్వయంగా గ్రా మ మహిళలే సంతోష్ కోసం ఇంటింటి ప్రచారం చేస్తూ గెలిపించాలని కోరడం గమనార్హం.
ఎన్నికల ప్రచారానికి ముందే గ్రా మంలో అన్ని వర్గాల ప్రజలకు తన సేవలు అందించిన సంతోష్ కౌన్సిలర్ గా గెలిస్తే తమకు అభివృద్ధిలో, సమస్యల పరిష్కారంలోనూ అండగా ఉంటారని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు ఎన్సీ సంతోష్ ను తమలో ఒకడిగా భావిస్తూ అండగా నిలుస్తున్నారు. ఏడవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ విజ యం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.